సిరా న్యూస్;
ప్రపంచ దేశాలతో మరో విషయంలో కూడా భారత్ పోటీ పడుతోంది. అయితే, ఇది సానుకూల విషయం కాదు. వాయు కాలుష్యంలో చాలా దేశాలను తలదన్ని భారత్ మూడో స్థానంలోకి ఎగబాకింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన రాజధానిగా ఢిల్లీ మరోసారి చెత్త రికార్డును మూటకట్టుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యభరితమైన మెట్రోపాలిటన్ ప్రాంతం బిహార్లోని బెగుసరాయ్ అని 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు వెల్లడించింది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ తాజాగా ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. కాగా, 2018 నుంచి ఏటా విడుదల చేసే రిపోర్టులలో ఢిల్లీ నాలుగు సార్లు మొదటి ప్లేస్లో ఉంది.దేశాల రాజధానుల విషయానికి వస్తే.. వాయు కాలుష్యంలో మన ఢిల్లీ తొలి స్థానం చేజిక్కించుకుంది. స్విట్జర్లాండ్ కు చెందిన సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ డేటా ఆధారంగా.. 2023 లో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య భరిత దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో, 2023లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ నిలిచాయి. కాలుష్య గణాంకాల ప్రకారం.. భారతదేశం వార్షిక పీఎమ్ 2.5 సగటు 54.4 μg/m3 కాగా, పాకిస్తాన్ వార్షిక పీఎం 2.5 సగటు 73.7 μg/m3, బంగ్లాదేశ్ వార్షిక పీఎం 2.5 సగటు 79.9 μg/m3గా ఉంది.2022 లో భారతదేశం వార్షిక పీఎం 2.5 సగటు53.3 μg / m3 గా ఉంది. అప్పుడు భారత్ ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశంగా ఉంది. 2021లో ఇది 58.10 గ్రాములు/మీ3గా ఉంది. 134 దేశాలు, భూభాగాలు, ప్రాంతాల్లోని 7,812 ప్రాంతాల్లోని 30,000కు పైగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల డేటా ఆధారంగా ఈ నివేదిక ను రూపొందించారు. మార్చి 19న విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరతి 50 నగరాల్లో 42 భారతదేశంలోనే ఉన్నాయి.ఆ నివేదిక ప్రకారం.. అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా న్యూఢిల్లీ (92.7 డిగ్రీలు/మీ3) నిలిచింది. భారత్ దేశంలోని నగరాల విషయానికి వస్తే, అత్యంత కాలుష్య నగరంగా బెగుసరాయ్ (118.9 అంగుళాలు/ మీ3) ఉంది. ఆ తరువాత స్థానంలో గౌహతి (105.4 g /m3) ఉంది. ఢిల్లీలో పీఎం 2.5 గాఢత 102.15 గ్రాములు/మీ3 ఉంది. పంజాబ్ లోని ముల్లాన్ పూర్ (100.400/మీ3), పాకిస్థాన్ లోని లాహోర్ (99.50/మీ3) అత్యంత కలుషిత ప్రాంతాలుగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో గ్రేటర్ నోయిడా (88.6 g/m3) 11వ స్థానంలో, గురుగ్రామ్ (840/మీ3) 17వ స్థానంలో ఉన్నాయి.మొత్తం 134 దేశాల్లో కాలుష్యానికిి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక పీఎం 2.5 సగటు అయిన 5 అంగుళాలు/మీ3 లేదా అంతకంటే తక్కువ ఉన్న దేశాలు ఏడు మాత్రమే ఉన్నాయి. అవి ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రెనడా, ఐస్లాండ్, మారిషస్, న్యూజిలాండ్.వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో రెండు దశాబ్దాల దిల్లీ ప్రయత్నాలు కూడా కొంతమేర ఫలితాలనిచ్చాయని నిపుణులు అంటున్నారు.కాలుష్యకారక పరిశ్రమలను తరలించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసేశారు. నేచురల్ గ్యాస్తో నడిచే ప్రజా రవాణా వ్యవస్థను మొదలుపెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రవాణా వ్యవస్థల్లో ఒకటి.పాత కమర్షియల్ వాహనాలను రోడ్లమీదకు రాకుండా నిలిపేశారు. ఉద్గారాలను అదుపు చేసేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అత్యంత సమర్థవంతంగా పనిచేసే మెట్రో వ్యవస్థను అభివృద్ధి చేశారు.శీతాకాలంలో సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు పంట కోతల సమయంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం కూడా పావుశాతం దిల్లీ కాలుష్యానికి కారణం. అయితే, అది కూడా గాలి వేగం, దిశల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది.పాత వాహనాలను నిషేధించడంతో దిల్లీ రోడ్లమీద మొత్తంగా కార్ల సంఖ్య తగ్గి 80 లక్షలకు చేరుకుంది. ఈ సంఖ్య 2015తో పోలిస్తే, మూడో వంతు కన్నా ఎక్కువ తగ్గింది.అయినా కూడా వాహన ఉద్గారాలే దిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణంగా ఉంది. దిల్లీ అర్బన్ డిజైన్, పాదచారులకు, సైక్లింగ్ చేసే వారి కన్నా కూడా, కార్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.దాదాపుగా 400 కిలోమీటర్ల పొడవుండే దిల్లీ మెట్రో నెట్వర్క్, ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే మెట్రో నెట్వర్క్. కానీ, చిట్టచివరి ప్రాంతాలకు , పని ప్రాంతాలకు చేరడంలోనూ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది.అయితే, దిల్లీలోని 7,000 బస్సుల్లో దాదాపు 14 శాతం బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలే. కానీ, అసౌకర్యాల వలన ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతోంది.దిల్లీలో 80 శాతం మోటారు వాహనాల ప్రయాణాలను ప్రజా రవాణా వ్యవస్థలోకి తీసుకురావాలని దిల్లీ మాస్టర్ ప్లాన్ లక్ష్యంగా పెట్టుకున్నా, మెట్రో, బస్సు వ్యవస్థల మధ్య సరైన సమన్వయం లేక ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.అయితే, సమగ్ర ప్రణాళికలో లోపాలు, విధాన రూపకల్పనలో తప్పిదాలు, పక్షపాత రాజకీయాల కారణంగానే వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో దిల్లీ తడబడుతోందని నిపుణులు అంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనా సంస్థలు, 30 వేలకు పైగా రెగ్యులేటరీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల నుంచి సేకరించిన డాటాతో ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. అలాగే 134 దేశాల్లోని 7,812 ప్రాంతాల నుంచి సేకరించిన డాటా విశ్లేషించినట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి గాలి కాలుష్యం వల్లే సంభవిస్తున్నదని తెలిపింది. పీఎం2.5 వాయు కాలుష్యం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి సంబంధింత సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. అలాగే ప్రజల్లో ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్స్, ఊపిరితిత్తుల వ్యాధులు సహా అనేక అనారోగ్యాలు కలుగుతున్నాయిని తెలిపింది.