చేర్యాలలో వ్యక్తిపై విచక్షణరహితంగా దాడి

సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా చేర్యాలలో రైస్ మిల్లు పార్ట్ నర్ల మధ్య వివాదం వీధుల్లో కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పార్ట్ నర్లల విభేదాలు బయటపడ్డాయి. లావాదేవీల చర్చ కోసం నారాయణ(65) ని మిగతా పార్ట్ నర్స్ పిలిచారు. నారాయణ రాకపోవడంతో ఇంటికి వెళ్లి నారాయణ ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారు. అందరూ చూస్తుండగానే బయటికి తీసుకువచ్చి నారాయణపై విచక్షణ రహితంగా దాడి చేసారు. అర్ధనగ్నంగా ఉన్న నారాయణని వీధిలో తిప్పుతూ దాడి చేస్తూ అరాచకం చేసారు. అడ్డుకోబోయిన నారాయణ భార్యపై కూడా దాడికి దిగారు. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *