దేవరకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన
సిరా న్యూస్,దేవరకొండ;
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బాబురామ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న శిశువు మృతి చెందడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని శిశువు తండ్రి ఆగ్రహంతో ఆస్పత్రి అద్దాన్ని పగలగొట్టాడు. మృత శిశువు తండ్రి రమేష్ వివరాల ప్రకారం దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండలం ఎర్రారం గ్రామపంచాయతీ సోములా నాయక్ తండా ఇస్లావత్ రమేష్ జ్యోతి దంపతులకు ఎనిమిది సంవత్సరాల కాన్పులో మగ శిశువు జన్మించడం జరిగింది. జ్యోతికి గత రెండు రోజుల క్రితం దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పు జరగింది. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న బాబురామ్ నాయక్ దేవరకొండలో ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. అప్పుడే పుట్టిన శిశువుకు ఆరోగ్యం సరిగా లేదని తన ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురావాలని బాబు రాం నాయక్ సూచనతో ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. శనివారం శిశువుకు బాగా ఆయాసం రావడం గమనించిన తండ్రి డాక్టర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడంతో నిన్నటి నుంచి బాబు ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ బాబురామ్ నాయక్ శిశువు దగ్గరికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నట్లు తెలుసుకొని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడని, ఆస్పత్రి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని బాధితుల రమేష్ ఆస్పత్రి ముందున్న ఓ అద్దాన్ని పగలగొట్టాడు. 8 సంవత్సరాల తర్వాత పుట్టిన మగ శిశువు మృతికి కారణమైన డాక్టర్ బాబురావు నాయక్ పై చర్యలు తీసుకోవాలని రమేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.