Infinity Charitable Trust: ఇన్ఫినిటీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆర్థిక చేయూత…

సిరా న్యూస్, కందుర్పి:

ఇన్ఫినిటీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆర్థిక చేయూత…

అనంతపూర్‌ జిల్లా కంబదూరు మందలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన యువకుడు మురళి కుటుంబ సభ్యులకు ఇన్ఫినిటీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆర్థికంగా చేయూతనందించింది. 2016లో మురళి బీటెక్‌ చదువుతుండగా, ప్రమాదవశాత్తు మతిస్థితిమితం కోల్పోవడంతో అప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెల్సుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ బద్దె నాయక్‌ స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రూ. 6వేల విలువ చేసే మందులు, రూ. 8వేల చెక్కును అందజేసారు. ఈ మందులు కర్ణాటకలోని శివమెగ్గ ప్రాంతంలోనే ప్రత్యేకంగా దొరుకుతాయని తెల్సుకొని, అక్కడి నుండి తెప్పించి బాదిత కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుపేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ట్రస్ట్‌ పనిచేస్తోందని అన్నారు. మురళి కుటుంబాన్ని ఆదుకోవడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *