సిరా న్యూస్, కుందుర్పి
మెదడు వాపుతో వ్యాధితో బాధపడుతున్నబాలుడు
* ఆర్థిక సాయం అందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే
అనారోగ్యానికి గురైన ఓ బాలుడికి శుక్రవారం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ చేయూత అందించారు. వివరాల్లోకెళ్తే… బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే గొల్ల నరసింహులు, లలితమ్మ దంపతులకు 4 సంవత్సరాల బాలుడు రామ్మూర్తి కి మూడేళ్లుగా బ్రెయిన్ సంబంధిత (మెదడు వాపు) వ్యాధి సోకింది. క్రమంగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో దయనీయ స్థితిలోకి చేరుకున్నారు. కనీసం తన ఆహారం కూడా తాను తీసుకోలేని ఆ బాలుడికి ఆహరం నోటి ద్వారా కాకుండా పొట్టలో నేరుగా ఒక ట్యూబ్ అమర్చి దానిద్వారా అందిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్న ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వైద్యానికి సరిపడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతుండగా గ్రామస్తుల ద్వారా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టు ను సంప్రదించగా ట్రస్టు ఛైర్మెన్ బద్దేనాయక్ రూ. 15,000/- చెక్ ను , 8,000/- కిరాణా సరుకుల ను ఆ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ములకలేడు సాయినాథ్, లోకేష్, మహేష్, సాయి, బ్రహ్మసముద్రం తిప్పేస్వామి పాల్గొన్నారు