మండలి బుద్ద ప్రసాద్
సిరా న్యూస్,అవనిగడ్డ;
గడిచిన అయిదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వెనుకబాటు తనానికి గురైన అవనిగడ్డ నియోజక వర్గ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా నని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.. జనసేన పార్టీ లో చేరిన అనంతరం అవనిగడ్డ లో తొలి సారి మీడియాతో మాట్లాడారు.
భయపెట్టి పాలన సాగుతోందని, ఎవరి కీ అభిప్రాయం చెప్పే స్వేచ్చ లేకుండా పోయిందని. చివరకు ప్రతిపక్షాల సమావేశాలకు వెళ్ళే వారిని బెదిరిం చడం చేశారని ఇలాంటి పాలనను అంతమొందించిప్రతీ మనిషి స్వేచ్ఛను కాపాడటం, భయ రహితులను చేయ డం లక్ష్యమన్నారు.ప్రభుత్వ కార్యాల యాలకు వెళ్ళే వారికి న్యాయం జరు గుతుందన్న నమ్మకం, ధర్మ బద్ద పాలన ఇవ్వడం కూటమి లక్ష్యమని, ప్రజల అభిప్రాయాలు నా ఎజెండా అని అన్నారు.ఈ అయిదేళ్ళు ఏమి జరిగిం దో అందరూ చూసారని, అలాంటి పాలనకు చరమగీతం పాడేందుకే టిడిపి, జనసేన, బీజీపీ ఏకమయ్యా యన్నారు.
================