అంతరాష్ట్ర దొంగ అరెస్టు

సిరాన్యూస్,విశాఖ;
అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసామని విశాఖ నగరం క్రైమ్ డీసీపీ వెంకట రత్నం వెల్లడించారు. నిందితుడు బిటెక్ విద్యార్థి కృష్ణమోహన్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. సినిమాలపై వ్యామోహంతో హైదరాబాద్ వెళ్లి, వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతుంటాడు. 248 గ్రాముల బంగారం రికవరీ చేశాం. చోరీ సొత్తును అమ్మగా వచ్చిన సొమ్ముతో గోవా, బెంగుళూరు, మైసూర్ వెళ్లి జల్సా చేస్తూ గుర్రపు రేస్ లకు వెళ్తుంటాడు. ఈ యువకుడిపై తెలంగాణా, కర్ణాటక, ఏపీల్లోని పీఎస్ లలో మొత్తం 148 కేసులు నమోదయ్యాయి. 190 గ్రాములు బంగారం రికవరీ చేయాల్సి ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *