చివరి క్షణం లో కుడా విడదీయలేని తల్లి కొడుకుల ప్రేగు బంధం.

ఆర్ధిక సమస్యలతో తల్లి బలవన్మరణం.. తల్లి బలవన్మరణం చూసి షాక్ కు గురై కొడుకు కుడా బలవన్మరణం
సిరా న్యూస్,హైదరాబాద్;
చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధి లో విషాదం నెలకొంది. తల్లీ కొడుకుల ఆత్మహత్య కలకలం రేపింది. కొత్తపేట లోని ఎస్ఎల్రా్ కాలనీ లో అద్దెకు ఉంటున్న ఒంగోలుకు చెందిన గుంజి శివ తన భార్య పద్మ తన ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఎస్ఆర్ఎల్ కాలనీ కొత్తపేటకు వచ్చారు.
ఈ క్రమంలో గుంజు శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో గుంజి పద్మ కొంతకాలం క్రితం కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు భరించలేక ఈరోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన పెద్ద కొడుకు గుంజి వంశీ ( 18 ) కన్న తల్లి ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురై తను కుడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. మృతురాలి రెండో కుమారుడు తన తల్లి మరణ వార్త ను స్థానిక బందువులకు, స్థానికులకు తెలియజేయడానికి వెళ్లి వచ్చే సరికి తన అన్న కుడా ఇలా ఆత్మ హత్య కు ఒడిగట్టడం తో, కండ్ల ముందే తల్లి తోడ బుట్టినవాడు ఇలా అర్ధంతరంగా నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయారా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *