ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ మాయంపై జిల్లా అధికారుల విచారణ

యధావిధిగా ఫర్నిచర్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేని కోరిన అధికారులు

సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 15 లక్షలకు పైగా ఫర్నిచర్ మాయమైందని నల్గొండ జిల్లా ఆర్ అండ్ బి (డి.ఈ) సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని క్యాంపు కార్యాలయాలలో ఫర్నిచర్ మాయమైందని ఆయన తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు 17 లక్షలు కేటాయించి ఫర్నిచర్ కొనుగోలు చేశామని నేడు కేవలం రెండు టేబుల్స్, ఒక కాళీ బెడ్ కాట్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు. మాయమైన ఫర్నిచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు పర్సనల్ సెక్రెటరీకి సమాచారం అందించామని యధావిధిగా ఫర్నిచర్ క్యాంప్ ఆఫీస్ లో ఉండాలని కోరామని లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని డి.ఈ సురేంద్ర కుమార్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *