సిరాన్యూస్, బేల
జీవిత బీమా పాలసీ చేసుకోవాలి: ఐపీఓ నాగిరెడ్డి రాజు
జీవిత బీమా పాలసీ జీవితంలో ముఖ్య భాగమని ఐపీఓ నాగిరెడ్డి రాజు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో జీవిత బీమా పాలసీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా జీవిత బీమా పాలసీ గురించి ఐపీఓ నాగిరెడ్డి రాజు మాట్లాడారు. ఎవరైన అనుకోకుండా గాయాల పాలైతే, రోడ్ యాక్సిడెంట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు , ఎవరూ లేనప్పుడు కూడా జీవిత బీమా పాలసీ హాస్పిటల్లో క్లైమ్ చేసుకోవచ్చుతెలిపారు. అదేవిధంగా ఇందులో ఆటో డ్రైవర్, బస్ డ్రైవర్ అసోసియేషన్ భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు కూడా చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఐపిబిపి మేనేజర్ రాజేష్, మేల్ ఓవర్సీస్ ప్రవీణ్ , గూడా బిపిమ్ కైలాష్ గౌడ్, సాంగిడీ బిపిమ్ వెంకట్ రాజు, ప్రనిత్, వినయ్ రెడ్డి, లక్ష్మణ్, రితేష్, పాల్గొన్నారు.