సిరా న్యూస్, సూర్యపేట:
కొండాయిగూడెంలో ఘనంగా ఇరుముడి…
సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కొండాయిగూడెం గ్రామంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం అయ్యప్ప స్వాముల 41రోజుల దీక్షా పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములకు పెద్ద ఎత్తున మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోటి రెడ్డి, వీరా రెడ్డి, సైదిరెడ్డి, అత్తి నరసింహారావు, రామిరెడ్డి, నాగిరెడ్డి, పలువురు పాల్గొన్నారు.