గవర్నర్ తమిళిసైని కలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్కు సీఈవో వికాస్రాజ్ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. ఇక కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలవనుంది. కాంగ్రెస్ శాసన భాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. వీలైనంత వరకు ఈ ప్రక్రియ ఇవాళే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.