సిరా న్యూస్;
2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్లో , ఆ తర్వాత గోకుల్ చాట్లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ దుర్ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.గోకుల్ చాట్ పేలుళ్లకు 17 ఏళ్లు భాగ్యనగరవాసులకు అదోక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. అదే ఆగష్టు 25, 2007. సరిగ్గా నేటికి ఆ విషాదం జరిగి 17 ఏళ్లు. సాయంత్రం వేళ ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడింది. చల్లని సాయం సంధ్యవేళ రెండు నిమిషాల వ్యవధిలో జరిగిన పేలుళ్లతో ఒక్కసారిగా షాక్కు గురైంది. లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఈ దుర్ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట పేలుళ్లలో 42 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు.పేలుళ్ల తర్వాత సిటీలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు…19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు.