మొక్కలు నాటిన మహిళలు
సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలం నాగేపెళ్లి గ్రామంలోని అంగన్వాడి 3వ కేంద్రంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణి స్త్రీలకు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మహిళా సాధికారత కేంద్రం జనరల్ స్పెషలిస్ట్ చంద్రు స్వప్న తెలిపారు.
ఈ సందర్భంగా జనరల్ స్పెషలిస్ట్ చంద్రు స్వప్న మాట్లాడుతూ, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల పట్ల వివక్షత చూపవద్దని, లింగ నిర్దారణ నిషేధం అని వివరిస్తూ, భ్రూణ హత్యలకు పాల్పడితే చట్టరీత్యా నేరమని, వైద్యులకు కూడ శిక్ష, జరిమాన ఉంటుందని అన్నారు.
అడపిల్లలు ఎందులోను తక్కువ కాదని, మహిళలు పనిచేసే చోట అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు 181, 1098, 14567, 112, 14416 ల గురించి, మహిళా చట్టాలు, హక్కులు, సఖీ కేంద్రం సేవలు, పొక్సో చట్టం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్, అంగన్వాడి సేవలు, పోషకాహారం, పిల్లల పెరుగుదల,
అనీమియ గురించి వివరించారు.
అనంతరం పర్యవరణ దినోత్సవం సందర్బంగా పిల్లలు, తల్లుల చేతుల మీదుగా మొక్కలు నాటించి, పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్, అంగన్వాడి సూపర్వైజర్ పి.శారద, ఫీల్డ్ అసిస్టెంట్ నాగేశ్, అంగన్వాడి టీచర్లు సుగుణ బాయి, లవణ్య, ఆయలు వసంత, మల్లీశ్వరి, మహిళలు పాల్గొన్నారు.
==============================