దాడులతో గెలుస్తామనుకోవడం అవివేకం

సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఎంపి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. వైసిపి నుండి జనసేనలోకి భారీగా కార్యకర్తలు చేరారు. స్ధానిక మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి నివాసంలో పెదయదర,వాడపాలెం గ్రామానికి చెందిన గ్రామస్థులు జనసేన పార్టీలో చేరారు. అలాగే వల్లభనేని బాలసౌరి మర్యాద పూర్వకంగా కలిసి ఎల్ఐసి ఉద్యోగులు, న్యాయవాదులు కూటమికి మద్దతు తెలిపారు. అనేక మంది జనసేన టిడిపి విధి విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. మచిలీపట్నంలో గత ఐదేళ్ల నుంచి ప్రజాస్వామ్యం లేదు. దాడులు చేస్తే వాళ్లు గెలుస్తామని అనుకోవడం అవివేకం. ప్రజలు గమనిస్తున్నారు…మే 13 వ తారీఖున తమ ఓటుతో సమాధానం చెబుతారన్నారు. ప్రతి ఒక్క దాన్ని సరి చేస్తామని ఎంపి వల్లభనేని బాలశౌరి హామి ఇచ్చారు.
=====================xxxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *