సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
రాష్ట్రవ్యాప్తంగా కూటమి సాధించిన విజయం ప్రజా విజయమని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటింగ్ సరళి పరిశీలించిన ఆయన మంగళవారం కూటమి విజయంపై స్పందించారు. తనకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో రికార్డు స్థాయిలో 60 వేల పైచిలుకు మెజారిటీ అందించిన తాడేపల్లిగూడెం నియోజవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గతంలో తాను మున్సిపల్ చైర్మన్.గా పనిచేసిన సమయంలో ఏ విధంగా అయితే ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించానో అదే రీతిన తన పాలన ఉంటుందన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, సహకరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు , నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు
తెలియజేశారు. రాబోయే ఐదేళ్లు ప్రజారంజక పాలన దిశగా కూటమి పనిచేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన తో కడుపు మండిన ప్రతి ఒక్కరు ఓటు రూపంలో జగన్ను మట్టి కరిపించారన్నారు. ప్రజలు డబ్బులకు లొంగరని నిజాయితీగా పనిచేసే నాయకులను అందలం ఎక్కిస్తారని ఎన్నికల్లో రుజువు చేశారన్నారు.