Jadhav Anil:నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతా

సిరాన్యూస్‌, బోథ్
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతా
* బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్
* ఘ‌నంగా శబరిమాత ఆశ్రమంలో విగ్రహ ప్రతిష్టాపన
* ఆశ్రమంలో ప్రత్యేక పూజలు…
బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో గురువారం బ్రహ్మ ముహూర్తం సమయాన శబరిమాత ఆశ్రమంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనగాంచారు. వేద పండితులు పండరి శర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల శబరిమాత ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతామన్నారు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని పూజలు చేయడం జరిగిందన్నారు ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించాలని వారి ఆశలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి రాజనాల సంధ్యారాణి, ఎంపీపీ తుల శ్రీనివాస్ తో పాటు మండలానికి చెందిన పలు గ్రామాల పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *