సిరాన్యూస్,బోథ్
వడదెబ్బకు గురైన బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్
* పరామర్శించిన బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ వడదెబ్బకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల లో ప్రచారం నిర్వహించడంతో వడదెబ్బబారిన పడ్డారు. దీంతో ఆయన స్వగృహంలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పరామర్శించారు. కాగా ఎండల తీవ్రత వల్ల కార్యకర్తలు ఉదయం, సాయంత్రం పూట ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వడ దెబ్బకు గురి కాకుండా కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.