Jadhav Rajesh Babu: ఉదారత చాటుకున్న జాదవ్ రాజేష్ బాబు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఉదారత చాటుకున్న జాదవ్ రాజేష్ బాబు…

+ అయోధ్య యాత్రకు వెళ్తున్న భక్తుల కోసం అన్నదానం

బిజెపి నాయకులు, నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు తన ఉదారత చాటుకున్నారు. బుధవారం కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. అయోధ్య శ్రీరాముని దర్శనార్థం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బయలుదేరుతున్న వేలాది భక్తుల కోసం తమవంతుగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు జాదవ్ రాజేష్ బాబు కుమారుడు జాదవ్ విజయ్ కుమార్ తెలిపారు. అయోధ్య యాత్రకు వెళుతున్న భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేయడం తమ సౌభాగ్యంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల అయోధ్య యాత్ర సఫలీకృతం కావాలని ఆయన ఆకాంక్షించారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *