Jadhav Rajesh Babu: రాజేష్ బాబు ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

సిరా న్యూస్, కొమరం భీం:

రాజేష్ బాబు ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కొమరం భీం జిల్లా వాంకిడి మండలంలోని శివకేశవాలయంలో, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిజెపి నాయకులు జాదవ్ రాజేష్ బాబు అరటిపండ్లు పంపిణీ చేశారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యం రాజేష్ బాబు పండ్ల పంపిణీ చేపట్టారు. భక్తులందరికీ శివానుగ్రహం కలిగి, సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువమోర్చా కొమరం భీం జిల్లా అధ్యక్షులు యేలాగతి సుచిత్, పార్టీ వాంకిడి మండల ప్రధాన కార్యదర్శి చీదారుల నరేష్, యువమోర్చా వాంకిడి మండల అధ్యక్షులు వికాస్, సోషల్ మీడియా వాంకిడి మండల కన్వీనర్ వేణు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు రామగిరి సచిన్, బిజెపి నాయకులు నాగోష సాయి, రాము, సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *