నిరుద్యోగులకు మోసం చేస్తున్న సీఎం జగన్

సిరా న్యూస్,విశాఖపట్నం;
నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ అని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు.రాష్ట్రంలో నిరుద్యో గులను జగన్ మోసం చేస్తున్నారని అన్నారు.ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని, ఎన్నికలకు 3 నెలల ముందు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని, విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.ఎన్నికలకు 6 నెలల ముందు నోటిఫికేషన్లు , శంకుస్థాపన చేస్తే ప్రజలను మోసం చేయడమే అని మీరే చెప్పారు కదా? అలాంటిది మీరు ఎలాగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవా లు నోటిఫికేషన్లు ఇస్తున్నారని అన్నా రు.నోటిఫికేషన్ లో చాలా లోపాలు ఉన్నాయని, హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చారని, ఇందులో పూర్తి వివరాలు లేవని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *