రైతులకు అన్యాయం చేసిన జగన్

సిరా న్యూస్,కొయ్యలగూడెం;
రైతులను అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రైతుల కోసం జగన్‌ 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని, ఐదేళ్లు పాలించిన జగన్‌.. వాటిని భర్తీ చేయకుండా గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని నిలదీశారు. మద్యపానం నిషేధం కాలేదు సరికదా.. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అమ్మిన బ్రాండ్‌ మద్యం వల్ల 25 శాతం మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులను జగన్‌ నట్టేట ముంచేశారని, పరిహారం ఇవ్వకుండా మొండి చేయి చూపించారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *