సిరా న్యూస్,నెల్లూరు;
వైసిపి నెల్లూరు సిటీ అభ్యర్ధిగా సామాన్యులకు జగన్ అవకాశం ఇచ్చారని ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాపై అనిల్ సెటైర్ వేసారు. పార్టీలో జగన్ నిర్ణయం ఫైనల్. అభ్యర్థులను నిర్ణయించేది జగన్ ఇష్టం. అభ్యర్థులను మార్చేది చెప్పలేదని పార్టీని వదలడం సరికాదు. మైనారిటికి అవకాశం ఇస్తే నచ్చక పార్టీని వదిలివెళ్లారు. టీడీపీ నేతలు వైసీపీ నేతలను పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారు.నేను నర్సారావుపేటలో ఉన్నా.. నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. కార్యకర్తల జోలికి వెళ్ళాలంటే నన్ను దాటగలగాలని అన్నారు.