ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన జగన్

సిరా న్యూస్,విశాఖపట్నం;
జగన్ పాలనలో ఏ ఒక్కరూ తృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోడవరం నియోజకవర్గ పరిశీలకులు మూర్తి యాదవ్ అన్నా రు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేసిన నాటి నుండి నేటి వరకు కూడా బటన్ నొక్కే కార్యక్రమం తప్ప మరొకటి చేయలేదని ఎద్దేవా చేశారు. నేనున్నాను అని చెప్పే ముఖ్య మంత్రి ఇచ్చాపురం నుండి కుప్పం వరకు ఎక్కడైనా రహదారులు బాగున్నాయా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో కొన్ని వర్గాలకే అన్యాయం జరిగిందనుకుంటే నేడు అంగన్వాడీ కార్యకర్తలకు మున్సి పల్ కార్మికులకు జరుగుతున్న అన్యా యం చేస్తుంటే ఇతని పాలనలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని అన్ని వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలుస్తుందని అన్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడి కార్యకర్తలు సమ్మె చేస్తున్న జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి గాలిలో తిరుగుతున్నా డని అన్నారు. ఏ ప్రజలు అయితే నీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారో అదే చిత్రపటానికి యాసిడ్ తో అభిషేకం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. పనికిమాలిన సలాదారులను పెట్టుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించాడని అన్నారు ప్రజా సంక్షేమానికి మారుపేరు తెలుగు దేశం పార్టీ ఒకటేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *