సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే వైసీపీకి పరాభవం. ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి చేసిన కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఇది. ప్రజా ఉద్యమాలను జగన్ అణిచివేసి పోలీసు రాజ్యం నడిపించారు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు చేశారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసేలా మూడు ముక్కలాట ఆడారు. విపరీతంగా అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు. అభివృద్ధి అనే మాటను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. ఫలితంగా జగన్ సర్కార్ ఓటమి చవిచూసిందని అన్నారు.