జగన్ పని అయిపోయింది

అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేసిన జగన్
శంఖారావం సభలో నారా లోకేష్
సిరా న్యూస్,నరసన్నపేట;
నరసన్నపేట శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 25 మందికి 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని విమర్శించారు.
జగన్ రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు. జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారు, వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. రంరోజుల్లో సిపిఎస్ రద్దుచేస్తానని చెప్పి, ఉద్యోగులను మాయచేసే జిపిఎస్ తెచ్చాడు, ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారు.
ఇప్పుడు ఒక కొత్త పథకం తెచ్చారు, ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్, ఒకరి ఇంట్లో చెత్త ఇంకోచోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరానివారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు, ఆరోజే జగన్ ఓటమి ఒప్పుకున్నారు. బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు, ఇది జగనాసుర రక్తచరిత్ర. జగన్ సొంత తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపారు. రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకు వెళతారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపారని చెప్పారు, చార్జిషీటులో వారి ఎంపి అవినాష్ రెడ్డి పేరు ఉంది, రేపోమాపో జగన్ పేరు కూడా ఆ లిస్టులో చేరుకుంది. జగన్ తాగేది ప్రజల రక్తం. క్వార్టర్ పై రూ.25 జే-ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఇది నేరుగా జగన్ జేబులోకి వెళుతోంది. మద్యం ద్వారా ఏడాది 9వేలకోట్లు చొప్పున అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేశాడు. మద్యం తయారు చేసేది, అమ్మేది జగన్ రెడ్డే. జగన్ రెడ్డిని చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఆయన బ్లూ బటన్ నొక్కి రూ.10 ఎకౌంట్లలో వేస్తే .. రెడ్ బటన్ నొక్కి వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశమిస్తే గాలిపైన కూడా పన్ను వేసే వ్యక్తి జగన్ రెడ్డి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారు. అన్న క్యాంటీన్లు, డ్రిప్ ఇరిగేషన్, చంద్రన్న బీమా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రెడ్డి రద్దు చేశారు. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు కిలో రూ.2కే బియ్యం ఇచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. చంద్రబాబు దీపం కనెక్షన్లు ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. వాలంటీర్లతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కార్యకర్తలంతా గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వారికంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పాలి. నేను 3,132 కి.మీ పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నాను. ఎటువంటి అనుమానం లేదు… వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణసౌకర్యం కల్పిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. 3రాజధానుల పేరుతో విశాఖను నాశనం చేశారు,రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. రైల్వే జోన్ కు కావాల్సిన భూమి కూటా కేటాయించలేదు. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వారు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారు. రామతీర్థంలో శ్రీరాముడి తల తీసేస్తే ఇంతవరకు బాధ్యులపై చర్యలు లేవు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *