సంబరాలు జరుపుకున్న పార్టీ నేతలు
సిరా న్యూస్,జగ్గంపేట;
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా తోట నరసింహం పేరును అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో జగ్గంపేటలో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు..మంగళవారం రాత్రి జగ్గంపేట మెయిన్ రోడ్ లో ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వీట్స్ పంపిణీ చేసి, భారీ బాణసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నేత అత్తులూరి సాయిబాబా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తోట నరసింహం కు జగ్గంపేట ఇన్చార్జి ప్రకటించడం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 2024 లో వైసీపీ విజయానికి కార్యకర్తలు అందరి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. మరోసారి జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. జగ్గంపేట నియోజకవర్గం లో వైసీపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని తోట నరసింహం స్వగృహానికి పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు, నరసింహ అభిమానులు చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.