Jakkula Venkatesh: పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

సిరాన్యూస్, బోథ్‌
పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన పక్షి ప్రేమికునికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. పక్షి ప్రేమికుడు అయినా జక్కుల వెంకటేష్ గత కొన్ని సంవత్సరాలు కాలంగా ప్రతి వేసవి కాలంలో పక్షులకు మంచినీటి వసతి కల్పించేందుకు వివిధ పాఠశాలలకు తిరిగి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పక్షుల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రశంసించారు. హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షులు పురుషోత్తం చేతుల మీదుగా అవార్డును ఆయ‌న అందుకున్నారు.ఆయన సొంత ఖర్చులతో బర్డ్ ఫీడర్లను అందించి పక్షులకు నీటి వసతి కల్పించేందుకు ఎంతగానో కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు.ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *