సిరా న్యూస్,చంద్రగిరి;
చంద్రగిరి మండలం, కొత్తశానంబట్లలో పశువుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. కొడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. భారీగా తరలి వచ్చిన వీక్షకులకు భోజనం తాగునీరు వసతులు కల్పించారు గ్రామస్తులు.
కొత్తశానంబట్లలో పశువుల పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. పశువుల యజమానులు గ్రామ దేవతకు పూజలు చేసి కోడెగిత్తలకు, అవులకు, దూడల కొమ్ములకు రంగులు వేసి కొప్పులు తొడిగారు. రాజకీయ నాయకుల, సినీనటుల ఫొటోలతో కూడిన రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలను, నగదును, విలువైన వస్తు సామాగ్రిని, కొమ్ములకు కట్టారు. మధ్యాహ్నం వీధిలో పశువులను గుంపులు, గుంపులుగా వదిలారు. అల్లి అవతల నిలబడిన యువకులు జోరుగా వచ్చే కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. కొమ్ములకు అంటించిన చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. జల్లికట్టు ను చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి యువకులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది.ఈ జల్లికట్టు లో యువకులకు 14 మందికి గాయాలయ్యాయి.
================================