కార్యకర్తలుకు అండగా నిలిచిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల ప్రమాద బీమా

సిరా న్యూస్,రాజోలు;
జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యునికి అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాద భీమా సౌకర్యం కల్పించారని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసానిస్తుందని ఎమ్మెల్యే దేవ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదంకు గురైన ఆరుగురుకి సుమారు రెండు లక్షల రూపాయల భీమా చెక్కులను మలికిపురంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *