సిరాన్యూస్, శంకపట్నం:
ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయాలి: జనగాం మణిదీప్ గౌడ్
ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనగాం మణిదీప్ గౌడ్ అన్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎక్కడ రక్తదాన శిబిరాలు జరిగిన, సోషల్ మీడియా ద్వారా తెలిసిన, ఏ ఒక్కరికి రక్తం కావలసి వచ్చిన అక్కడ హాజరవుతూ ఉంటాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తనది O+ పాజిటివ్ అని ఇప్పటివరకు 19సార్లు రక్తం ఇచ్చానని, రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి జీవితాన్ని కాపొడచ్చని ఈ సందర్భంగా గుర్తుచేశారు.