శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకున్న ఆఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ్యుడు జనగామ తిరుపతి

సిరా న్యూస్,కమాన్ పూర్;
శ్రీఅయ్యప్పస్వామి దీక్షతీసుకుని, భక్తి మార్గంలో, నిత్యపూజలు చేస్తు అయ్యప్పస్వామికి ఆత్మనివేదనచేసి, శరీరాన్ని మనసును చెడు నుండి మంచిమార్గంలో నడిపించి కోరిన కోర్కెలు తీర్చుకునేందుకు మండలకాలంమాల ధరించి అనుక్షణం ఆలయం వద్ద స్వామివారి సన్నిదిలో గడిపి స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోష ఉచ్చరిస్తు , స్వామిని ప్రతిక్షణం స్మరిస్తూ, సాత్విక జీవనం గడిపి ఆధ్యాత్మికత పై అవగాహన చేస్తు మండలకాలం ముగించుకుని మంగళవారం రామగుండం నుండి పయనమై బుదవారం నాడు సన్నిధానం చేరుకుని గురువారం ఉదయం అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు అఖిల భారతీయ అయ్యప్పధర్మప్రచారసభ్యుడు జనగామ తిరుపతి తెలిపారు. ముందుగా చెంగనూరు నుండి ఎరుమేరి,నీలకల్ మీదుగా పంబా చేరుకుని, పంబాలో పుణ్యస్నానాలు ఆచరించి గతంలో తెలిసి తెలియక చేసిన పాపాలను, చేడుఅలవాట్లను పంబ నదిలో వదిలి (విసర్జించి) పునీతులు అయి కాలినడకన (చిన్నపాదం – పాదయాత్ర) కన్నెమూల గణపతి, నీలమల, అప్పాచిమేడు, శరనిగుత్తి మీదుగా స్వామివారి పాటలు పాడుతు శరణుఘోషచెప్పుతు, కఠోరదీక్షకు పరీక్షలాగా రాళ్ళు రప్పలు దాటుతు, నయనానందకరమైన కొండలు కోనలు, లోయలు చూస్తూ స్వామివారి తన్వయత్వంలో శబరిమల చేరుకుని అయ్యప్ప దీక్షలోని ప్రదానగట్టమైనపదునాట్టంబడి (బంగారు మెట్లు) ఎక్కి స్వామివారిని దర్శించుకుని తరించాము అని అఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనె ఇరుముడులు ఇప్పి కట్నకానుకలు సమర్పించి, అక్కడే ఉన్న మాలికపురమాతను దర్శించుకుని మొక్కులు చెల్లించి అమ్మవారికి చీరజాకెట్ తో ప్రత్యేకపూజలు చేయించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ గురు స్వాములు నందంనాగవర్దన్ రావు, క్రిష్ణ ప్రసాద్, మోహిత్ సాయి, హేమంత్ , సత్యనారాయణ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *