సిరాన్యూస్, భీమదేవరపల్లి
* పంచాయతీ కార్యదర్శుల మండల కార్యవర్గం ఎన్నిక
* అధ్యక్షుడిగా ఎన్నికైన జంగం పూర్ణచందర్
భీమదేవరపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గాన్ని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎన్నుకున్నారు. ఎంపీడీవో నాగంపల్లి వీరేశం నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా జంగం పూర్ణచందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు కె. సదానందం, ప్రధాన కార్యదర్శిగా బి.సురేందర్ లను ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎస్. సరిత, గౌరవ అధ్యక్షుడిగా బి. వెంకటేష్, ప్రచార కార్యదర్శిగా పి . అనంతరెడ్డి, సహ కార్యదర్శిగా పి. రాజేంద్రప్రసాద్ లతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు జంగం పూర్ణచందర్ తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎంపీడీవోతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అభినందించారు.