-మంథని పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మోదుంపురం విజయ్
సిరా న్యూస్,మంథని;
విశ్వబ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు మరువలేనివని మంథని పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మోదుంపురం విజయ్ అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంథని పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకున్న వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు తంగళ్ళపల్లి మధుకర్, వంగల తిరుమలేష్,గుండోజు ప్రవీణ్, దేవరకొండ నగేష్,బోగోజు రమేష్, సిరికొండ నాగన్న, సిరికొండ శ్రీనివాస్, కందుకూరి రామ్మూర్తి,బొల్లంపల్లి లక్ష్మణ్, కొమురోజు వేణు లతో పాటు పలువురు పాల్గొన్నారు.
=================