JEE Mains: జేఈఈ మేయిన్స్ లో నర్రా సిరి యాదవ్ ప్ర‌తిభ‌

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
జేఈఈ మేయిన్స్ లో నర్రా సిరి యాదవ్ ప్ర‌తిభ‌

జేఈఈ మేయిన్స్ సెకండ్ సెషన్ లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నర్రా నవీన్ యాదవ్ -రమాదేవి కుమార్తె నర్రా సిరి యాదవ్ రాష్ట్రస్థాయిలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చారు. ఆలిండియా ఓబీసీ కేటగిరిలో 2460 ర్యాంకు సాధించి. ఇండియా లెవెల్ లో 12 లక్షల 50 వేల మంది జేఈఈ మేయిన్స్ ఎగ్జామ్ రాశారు. అందులో నుంచి జేఈఈ అడ్వాన్స్ కోసం 2 లక్షల 50 వేల మంది సెలెక్ట్ అయ్యారు. కాగా నర్ర సిరి యాదవ్ కు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సైతం 990/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో నిలిచారు. ఈసంద‌ర్భంగా ఆమెను త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప‌ట్ట‌ణ వాసులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *