jeera swamy: ఘ‌నంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

సిరాన్యూస్, భీమదేవరపల్లి
ఘ‌నంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
* హాజ‌రైన దేవానందా జీయర్ స్వామి
భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామంలోనీ కోదండ రాముడి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవానికి దేవానందా జీయర్ స్వామి వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్చకులు, సీతా రాముల వారికి వేదమంత్రోచ్ఛరణం మధ్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టూ పక్కల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *