సిరాన్యూస్, ఆదిలాబాద్
నకిలీ విత్తనాల కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ రద్దు
* పోలీస్ కస్టడీ కోసం పిటిషన్
* వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
నకిలీ విత్తనాల కేసులో ప్రధాన నిందితుల బెయిల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రద్దు చేసినట్లు డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గత నెల 25న ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల తయారు కేంద్రాన్ని నెలకొల్పి, రైతులను మోసగించే ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుండి దాదాపు 500 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, వాటి విలువ 19 లక్షలు గా ఉంటుందన్నారు. ఈ క్రమంలో వారికి బెయిల్ లభించడంతో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా సెషన్స్ కోర్టులో రివిజన్ ఫైల్ చేయగా, వాదనలు విన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు బెయిల్ ను రద్దుచేసి మూడు రోజుల్లోగా లొంగిపోవాలని తెలియజేశారు. అందుకుగాను సోమవారం ఏ1) సామ అశోక్ రెడ్డి, ఏ2) రాజేందర్ లు మున్సిఫ్ కోర్టులో లొంగిపోవడం జరిగిందని తెలిపారు. వారికి కోర్టు వారు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించడంతో జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మహారాష్ట్రలోని జాల్న, కర్ణాటక, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో గల ఆఫీసుల నందు తనిఖీలు నిర్వహిస్తూ విచారించేందుకు జిల్లా పోలీసులు తరఫున ప్రధాన నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీని కోరడం జరుగుతుందని తెలిపారు. నేరానికి పాల్పడినటువంటి నిందితులకు ఆశ్రయమిచ్చిన షాపుల ఓనర్ కు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోడౌన్ ను ఎమ్మార్వో సమక్షంలో స్వాధీనం చేయడం జరిగిందన్నా