సిరా న్యూస్, కళ్యాణదుర్గం:
రోడ్డు మద్యలో విద్యుత్ లైన్…
+ తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
+ పట్టించుకోని పాలకులు, అధికారులు
+ లైన్ తొలగించాలని స్థానికుల వేడుకోలు
అనంతపురం జిల్లా కందబూరు మండలంలోని జెక్కిరెడ్డి పల్లి గ్రామంలోని హరిజనవాడలో రోడ్డు మద్యలోఉన్న విద్యుత్ లైన్ను తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. రోడ్డుకు మద్యలోనే విద్యుత్లైన్తో పాటు ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ లైన్ను తరలించాలని పలుమారులు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. పెను ప్రమాదం ఏదీ జరగక ముందే అధికారులు విద్యుత్లైన్తో పాటు ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని వేడుకుంటున్నారు.