Jekkireddy Palli: రోడ్డు మద్యలో విద్యుత్‌ లైన్‌…

సిరా న్యూస్, కళ్యాణదుర్గం:

రోడ్డు మద్యలో విద్యుత్‌ లైన్‌…
+ తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
+ పట్టించుకోని పాలకులు, అధికారులు
+ లైన్‌ తొలగించాలని స్థానికుల వేడుకోలు

అనంతపురం జిల్లా కందబూరు మండలంలోని జెక్కిరెడ్డి పల్లి గ్రామంలోని హరిజనవాడలో రోడ్డు మద్యలోఉన్న విద్యుత్‌ లైన్‌ను తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. రోడ్డుకు మద్యలోనే విద్యుత్‌లైన్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ లైన్‌ను తరలించాలని పలుమారులు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. పెను ప్రమాదం ఏదీ జరగక ముందే అధికారులు విద్యుత్‌లైన్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *