సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పేట అక్బర్ బాగ్ లోని కిశ్వ జ్యూవెలరీ లో భారీ చోరి చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చారు., అక్బర్ బాగ్ చౌరస్తాలో ఉన్న కిశ్వా జ్యువెలర్స్ షాప్ లోకి వెళ్లి, షాప్ లో ఉన్నటువంటి సజావుర్ రెహమాన్ పై కత్తితో దాడి చేశారు., షాప్ లో బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారి పోయారు. ఈ దాడి లో వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చోరి ఎంత మేరకు జరిగిందని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దారవత్. క్లూస్ టీన్ సందర్శించారు.