తలమడుగు, సిరా న్యూస్
ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం ఆదివారం విడుదలైన నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలలో ఎంపికైన తలమడుగు గ్రామానికి చెందిన మంతెన సాయికిరణ్, శ్రీరాముల పవన్ కల్యాణ్, ఎడిమేలా రాజేష్ రెడ్డి లను అలాగే ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో ఎంపికైన హట్కర్ స్వయం దీప్ ను గ్రామస్తులు శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని యువకులు ఉద్యోగం సాధించిన అభ్యర్థులను ఆదర్శంగా తీసుకోని బాగా చదివి ఉద్యోగాలు సాధించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పిడుగు అభిరామ్ రెడ్డి, అసం రవి, నవీన్ రెడ్డి, నెతుల గంగన్న, ఎలుగు ఆనంద్, నారాయణ రెడ్డి ,మేకల రమాకాంత్,
మంతెన శ్రీకాంత్ గ్రామస్తులున్నారు.