Jogu Premendar: ఆధ్యాత్మిక చింత‌న‌తో ప్ర‌శాంత జీవ‌నం

సిరా న్యూస్, జైన‌థ్‌
ఆధ్యాత్మిక చింత‌న‌తో ప్ర‌శాంత జీవ‌నం
* మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్
* కొరట శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు
ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కొరట గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ ను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకుని కమిటి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కొండ గణేష్, పవన్ నాయక్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *