Jogu Ramana.. క్రీడాకారుల లకు బాసటగా జోగు ఫౌండేషన్…

సిరా న్యూస్, జైనథ్:

క్రీడాకారుల లకు బాసటగా జోగు ఫౌండేషన్…

మాజీ మంత్రి జోగు రామన్న

జైనథ్ మండలం కంఠ గ్రామంలో గణేష్ యూత్ మండల్ ఆధ్వర్యంలో జోగు ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమనికి మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసి, అభినందించారు. టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన జట్టుకు జోగు ఫౌండేషన్ తరపున రూ. 25 వేల రూపాయల నగదు బహుమతిగా అందించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడినవారు నిరాశకు గురికావద్దన్నారు. ఆసక్తి కలిగిన క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. క్రీడాకారులకు జోగు ఫౌండేషన్ ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. ఎంపీపీ మార్శేట్టి గోవర్ధన్, గంట రమేష్. ఇజ్జగిరి నారాయణ, బాలాజీ, లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *