సిరాన్యూస్, ఆదిలాబాద్
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న
రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రజలకు , ముస్లిం సోదరులకు మాజీ మంత్రి , బీఆర్ ఏస్ పార్టీ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్నరంజాన్ పండుగ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని , పండుగను భక్తి శ్రద్దలతో , ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. సేవాదృక్పథ భక్తి ప్రవృత్తులు , సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషం గా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసమంతా ప్రపంచ వ్యాప్తంగా నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.