Jogu Ramanna: కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను కరువుగా ప్రాంతంగా మారుస్తున్నాయి :మాజీ మంత్రి జోగు రామన్న‌

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను కరువుగా ప్రాంతంగా మారుస్తున్నాయి :మాజీ మంత్రి జోగు రామన్న‌
* ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో బీఆర్ఎస్ నాయ‌కుల విస్తృత ప్ర‌చారం

తెలంగాణ ప్రజలు టాక్సులు కడుతున్న కానీ ..ప్రజలకు సంక్షేమ పథ‌కాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తిరిగి ఇవ్వలేకపోతుందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. గత బి ఆర్ఎస్ ప్రభుత్వంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాలకు అండగా గత కారు గుర్తు ప్రభుత్వం నిలిచింది అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని మోచి గల్లి తో పాటు వార్డ్ నెంబర్ 46 జామ మస్జిద్ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గడపగడపకు ఓటర్లను కలుస్తూ తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఆత్రం సక్కు ను బలపరచాలని విజ్ఞప్తి చేశారు.. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయి అన్నారు. పేదవారి ఇండ్లలో జరగాల్సిన పెళ్లిళ్లు నిలిచిపోయాయని, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ కేంద్రాన్ని మూసివేయడం జరిగిందని, గ్యాస్ ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు ప్రజలను తీవ్ర సంక్షోభానికి గురి చేస్తున్నాయన్నారు. గత బి ఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతాంగం సుభిక్షంగా ఉండేది అన్నారు.. కాంగ్రెస్ బిజెపి పాలనలో ప్రజలతో పాటు రైతాంగం తీవ్ర కరువును ఎదుర్కొనే పరిస్థితులు వస్తున్నాయని, పంటలు ఎండిపోయి జలాశయాలు అడుగంటిపై తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను, అన్యాయాలను పార్లమెంట్లో నిలదీసే వ్యక్తిగా ఆత్రం సక్కుకు అని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్లు ధర్మాపాల్, రామ్ కుమార్, కోవ రవి, స్వాగత్, పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి, మమత, పర్వీన్, కరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *