సిరాన్యూస్, జైనథ్
పుప్పాల భూమన్న కుటుంబాన్నిపరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పుప్పాల భూమన్నఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.