సిరా న్యూస్, ఆదిలాబాద్:
సంత్ రవిదాస్ జయంతి వేకుకల్లో జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్కూరి లక్ష్మీ నగర్లో ఆదివారం నిర్వహించిన సంత్ రవిదాస్ 647వ జంతి వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి సంత్ రవిదాస్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంత్ రవిదాస్ సేవలను కొనియాడారు. అప్పట్లో సమాజంలో నెలకొని ఉన్న అసమానతలు, వివక్షను ఎత్తి చూపేలా ఆయన చేసిన రచనలు నేటికి ఆదర్శమని అన్నారు. తన ఆలోచనలతో సమాజాన్ని మేల్కోపిన మహానీయుడని కొనియాడారు. ప్రతీ ఒక్కరు సంత్ రవిదాస్ చూపిన మార్గంలో నడవాలన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు జోగు రామన్నను శాలువాతో ఘనంగా సత్కరించారు.