సిరా న్యూస్, ఆదిలాబాద్
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
* మాజీ మంత్రి జోగు రామన్న
* ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురిని శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. అదేవిధంగా మాజీ మంత్రిని సైతం శాలువాలతో సత్కరించారు. ఈమేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించి… తమదైన గుర్తింపు సాధించలన్నారు. సంఘ చైతన్యం కోసం మహిళలు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని కొనియారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ సంబరాలు, వినాయక నవరాత్రి వేడుకలు, దసరా నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయడంలో మహిళా సభ్యుల కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తిని కనబరుస్తూ మనో ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాళ్ళ విట్టల్, మహిళా విభాగం అధ్యక్షురాలు దేశెట్టి ప్రభ, జోగురమని, సంధ్య, సంద నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.