Joguramanna: ఉపాధి కూలీల‌పై తేనెటీగల దాడి… పరామర్శించిన మాజీ మంత్రి జోగురామ‌న్న‌

సిరాన్యూస్‌, బేల‌
ఉపాధి కూలీల‌పై తేనెటీగల దాడి… పరామర్శించిన మాజీ మంత్రి జోగురామ‌న్న‌

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలను విస్మరిస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం డౌన గ్రామ పరిధిలోని ఉపాధి హామీ కూలీలఫై గురువారం తేనెటీగలు దాడి చేయగా వారినిన‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిని మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కూలీలకు ప్రమాదం సంభవించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించే సౌకర్యం ఉంటుందన్నారు. ఉపాధి హామీ కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని, ఎండలో సైతం కనీసం తాగునీరు టెంట్ ఆటో చార్జర్ ఇవ్వకుండా కూలీల పట్ల నిర్లక్ష్యం వాయిస్తున్నాయని ధ్వ‌జమెత్తారు.ఉపాధి హామీల కూలీల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. అలాగే అనుకోకుండా గాయపడిన ఉపాధి హామీ కూలీలకు తేనెటీగల గాయాలు పూర్తిగా నయం అయ్యేవరకు వారి కూలీ కట్ చేయకుండా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయ‌న వెంట‌ ఇజ్జగిరి నారాయణ. యాసం నర్సింగరావు, సతీష్, కౌన్సిలర్ భూమన్న‌, రాజేష్‌, ర‌మేష్.తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *