Joguramanna: యావత్ సమాజానికి సీఎం క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి జోగురామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
యావత్ సమాజానికి సీఎం క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి జోగురామన్న
* అధికార దాహం లో ముఖ్యమంత్రి అంబేద్కర్ ను విస్మరిస్తున్నారు
* మార్నింగ్ వాకర్స్ ను కలిసి జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు

పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. సోమవారం ఉదయం మార్నింగ్ వాకర్స్ ను కలిసి మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. నడక సాధకులను కలిసి వారితో సరదాగా ముచ్చటించారు. బీ.ఆర్.ఎస్ హయంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారి మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కార్మికులను బీ.ఆర్.ఎస్ నేతలు కలిశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ప‌థ‌కాలను వివరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ ప్రచారాన్ని కొనసాగించారు.. అలాగే స్థానిక సత్నాల బస్ స్టాండ్ సమీపంలోని చమన్ వాలే బాబా దర్గాలో చాదర్ సమర్పించారు. మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం అక్కడున్న దుకన సముదాయాలు, బస్ స్టాండ్ సమీపంలో ప్రయానికులను కలిసి కారు గుర్తు అభ్యర్థిని భారి మెజారిటీ తో గెలిపించాలని కోరారు. గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పతకాలను వివరిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. సమగ్ర అభివృద్ధి కేవలం బీ.ఆర్.ఎస్ తోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ప్రచార పర్వంలో భాగంగా మాజీ మంత్రి ఆటో నడపడం అందరిని ఆకట్టుకుంది. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ…. అన్ని వర్గాల అభ్యున్నతి కేవలం బీ.ఆర్.ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో అనేక సంక్షేమ పతకాలను అమలు చేసి సమగ్ర అభివృద్ధికి పాటు పడిన విషయాన్నీ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ లు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. బీ.ఆర్.ఎస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సీఎం తన అధికారా దాహంతో రాజ్యాంగ కర్త అంబేద్కర్ సైతం విస్మరించడం తన అహంకారానికి నిదర్శనం అన్నారు. అంబేద్కర్ పట్ల ఇంత అవమానంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకేల్లిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్, అజయ్. ఇజ్జగిరి నారాయణ సాజితుద్దీన్, యూనిస్ అక్బాని, రోకండ్ల రమేష్.అశోక్ స్వామి. లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *