Joguramanna: హామీల అమ‌లులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం :బీఆర్ఎస్ జిల్లా జోగురామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
హామీల అమ‌లులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం :బీఆర్ఎస్ జిల్లా జోగురామన్న
* పోస్టల్ కార్డు ఉద్యమం ప్రారంభం

ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ మరొక్కసారి ప్రజలను మాయమాటలతో మోసం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. హామీల అమలుపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోస్టల్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలకు ఆర్ధిక సహాయం, నాలుగు వేల పెన్షన్ తదితర హామీలను పోస్టల్ కార్డుల్లో ప్రస్తావిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. కార్యక్రమంలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఎంపీపీ తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలోని పదమూడు పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. రెండు వందల యూనిట్ ల లోపు ఉచిత విద్యుత్తు, అయిదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలు సైతం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అదేవిధంగా నాలుగు వేల పెన్షన్ పై సైతం ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం సంగతేంటని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల వేల రుణమాఫీ పై కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన… రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుండి పోస్టల్ కార్డు ఉద్యమం ద్వార ప్రభుత్వానికి హామీలను గుర్తు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *